Ministers Buggana, Anil Yadav: కోవిడ్ పై మంత్రులు బుగ్గన, అనిల్ యాదవ్ సమీక్షా సమావేశం
కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను దోచుకున్నాయన్నారు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్ కుమార్ యాదవ్. కర్నూలులో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు..కోవిడ్, ఓటీఎస్ లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలని..ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.