MP Aravind on GO 317: ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద పోలీసు పహారా
నిజామాబాద్ ఎంపీ ధర్మపురం అర్వింద్ భీంగల్ వెళ్లి ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబీకులకు పరామర్శించకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి ఆయన ఇంటివరకు ఫాలో అయిన పోలీసులు.... ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా చూసుకుంటున్నారు. టోల్ ప్లాజా వద్ద మీడియాతో మాట్లాడిన అర్వింద్... 317 జీవోకి వ్యతిరేకంగా భాజపా పోరాటం చేస్తుందని, ఉపాధ్యాయులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు.