Mohan Bhaghavath : అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. అత్యంత భద్రత నడుమ అంతర్వేదికి వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఏడాది క్రితం దగ్ధమైన స్వామి వారి రథాన్ని పరిశీలించారు మోహన్ భగవత్. అనంతరం గ్రామంలోని ఆర్ఎస్ఎస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన మోహన్ భగవత్....పాలకొల్లు లో జరిగే ఆర్ఎస్ఎస్ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు.