ABP News

MLA Roja : వైసీపి కోవర్టులపై చర్యలు తీసుకోవాలని నగిరి‌ ఎమ్మెల్యే ఆర్.కే.రోజా ఫిర్యాదు

Continues below advertisement

వైసీపి కోవర్టులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్‌కుమార్ కి నగిరి‌ ఎమ్మెల్యే ఆర్.కే.రోజా ఫిర్యాదు చేశారు.. చిత్తూరులోని ఎస్పి బంగ్లాలో ఎస్పిని‌ కలిసి విన్నతి‌ పత్రం అందించారు.. అనంతరం ఆర్.కే.రోజా మీడియాతో మాట్లాడుతూ.. వైసీపిలో ఉంటూ టిడిపితో జత కలిసే వారిని ఉపేక్షించేది‌ లేదంటూ రోజా‌ మండి‌పడ్డారు.. ఏపి డిజిపి పోటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో‌ ఫోటోలు వేసుకుని ఫ్లేక్సీలు వేసుకుని అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.. గతంలో వైసీపిలో సస్పెండ్ అయిన వారు వైసీపి పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్ కుమార్ కి ఫీర్యాదు చేసినట్లు ఆర్.కే.రోజా‌ తెలియజేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola