Minister Gangula Kamalakar: కరీంనగర్ జిల్లాలో పెండింగ్ పనులపై త్వరలో సమీక్ష సమావేశం నిర్వహిస్తాం
కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనుల పై మాట్లాడిన మంత్రి..... కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, పాత ఎలగందుల రోడ్డు పనులకు మరిన్ని నిధులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించారని తెలిపిన మంత్రి గంగుల.....త్వరలోనే జిల్లాస్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు.