అశోక్ గజపతిరాజు తప్పు చేసి నిందలు మాపై వేస్తారా : మంత్రి బొత్స
మాజీ కేంద్రమంత్రి, టీడిపి సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై , మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేసారు. బోడికొండపై అశోక్ గజపతిరాజు వ్యవహరించిన తీరు సరైనది అయితే తాను తలదించుకుంటానని, కావాలనే ఆయన పొలిటికల్ స్ట్రాటజీతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లక్ష రూపాయలు విరాళం ఇచ్చి ,కండీషన్లు పెట్టిన గజపతిరాజు, ధర్మకర్తగా ఆలయ అభివృద్దికి ఏనాడూ సహకరించలేదని ఆరోపించారు మంత్రి బొత్స.