మోహన్ బాబు University ఈ ఏడాది ప్రారంభం కానుందన్న MAA అధ్యక్షుడు మంచు విష్ణు

సినిమా టిక్కెట్లపై సినీ పరిశ్రమ ఏకత్రాటిపై రావాలని సినీ నటుడు Manchu Vishnu తెలిపారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన Manyam Raju మూవీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మా అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, Mohanbabu  University ఈ ఏడాది ప్రారంభం కానుందని, ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందన్నారు.సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని తెలియజేశారు.సినిమా టిక్కెట్ల ధరలు తెలంగాణలో పెంచితే, ఏపీలో తగ్గించారని, కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారని తెలియజేశారు.ఈ విషయం దీనిపై సినీ పరిశ్రమ ఏకత్రాటి పైకి రావాలని కోరారు.టికెట్ల ధరల వివాదంపై తెలుగు Chamber Of  Commerce  నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola