Manchu Laxmi: కరోనా నన్ను కూడా వదల్లేదు... కానీ నా కలరీ ప్రతిభతో దాని అంతు చూస్తా

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రెండేళ్లుగా ఆ బూచోడి నుంచి తప్పించుకు తిరుగుతున్నా. కానీ ఫైనల్ గా నన్ను పట్టేసుకున్నాడు. గో కరోనా గో అని అరిచినా పట్టించుకోలేదు. నేనెంత కష్టపడినా తప్పలేదు. దీని నుంచి బయటపడటానికి నా వంతు ప్రయత్నం చేస్తా. నాకొచ్చిన కలరీపట్టుతో దాన్ని తరిమికొడతా అంటూ పోస్ట్ చేశారు మంచు లక్ష్మి. అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని.. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola