Mallika Billupati : మిసెస్ ఇండియా 2021-22 విజేతగా విజయవాడవాసి మల్లిక బిల్లుపాటి
విజయవాడ నగరానికి చెందిన మల్లిక బిల్లుపాటి మిసెస్ ఇండియా 2021 గా ఎంపికయ్యారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో పేజెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన 9వ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన వివాహితలు పాల్గొనగా మల్లికా మొదటిస్థానంలో నిలిచారు. వీటికన్నా ముందు.. శ్రీమతి అమరావతి 2019గా కూడా ఎంపికయ్యారు. 2020లో జరిగిన మిసెస్ ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ రన్నరప్ గా నిలిచారు మల్లిక.