Mallika Billupati : మిసెస్ ఇండియా 2021-22 విజేతగా విజయవాడవాసి మల్లిక బిల్లుపాటి

విజయవాడ నగరానికి చెందిన మల్లిక బిల్లుపాటి మిసెస్ ఇండియా 2021 గా ఎంపికయ్యారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ లో పేజెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన 9వ మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన వివాహితలు పాల్గొనగా మల్లికా మొదటిస్థానంలో నిలిచారు. వీటికన్నా ముందు.. శ్రీమతి అమరావతి 2019గా కూడా ఎంపికయ్యారు. 2020లో జరిగిన మిసెస్ ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ రన్నరప్ గా నిలిచారు మల్లిక.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola