Mahendra Nath Pandey : వ్యాక్సిన్ సెంటర్ లో మోదీ ఫొటో ఉండాల్సిందే| ABP Desam
మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టణంలోని పాత పాలమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన క్రమంలో.. వ్యాక్సిన్ సెంటర్ లో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడాన్ని తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫొటో ఉంది. అలాగే, వ్యాక్సినేషన్ సెంటర్ లోనూ ఫొటో ఉండాల్సిందేనని అన్నారు. దేశమంతా ప్రధానిని గౌరవిస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అగౌరవపరుస్తున్నారని ఆయన విమర్శించారు.