Last Rites For Holy Bull: దేవరఎద్దు అంత్యక్రియలకు వేలాదిగా హాజరైన జనం | ABP Desam
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని గొడుగుచింత గ్రామంలో యాదవుల ఆరాధ్యదైవం దేవరఎద్దు.... గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. ఊరేగింపుగా తీసుకెళ్లిన గ్రామస్థులు.... సంప్రదాయ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. భక్తులు, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు వేలాదిగా తరలివచ్చారు. కళా ప్రదర్శనలు, వాద్యాలతో దేవరఎద్దుకు తుది వీడ్కోలు పలికారు. ఆరాధ్యదైవంగా పూజించే దేవరఎద్దు మరణంతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు.