Khammam :ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం|TRS|BJP| ABP Desam
Khammam త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సాయిగణేష్ అనే BJP కార్యకర్త పోలీసుల వేదింపుల వల్లే మృతిచెందాడని, ఇందుకు ప్రభుత్వం బాద్యత వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సాయిగణేష్ గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన పార్టీ దిమ్మెను కొంతమంది ద్వంసం చేశారు. ఈవిషయంపై త్రీటౌన్ పోలీస్స్టేషన్లో పిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, దీంతోపాటు సాయిగణేష్ను పోలీసులు తిట్టడం వల్లే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.