Kerala Rain Fury : కేరళను ముంచెత్తుతున్న భారీవర్షాలు, వరదలు

కేరళను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. 2018 తర్వాత ఆ స్థాయిలో మళ్లీ భారీవర్షాలు కురువటంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరదల విలయంలో చిక్కుకున్నాయి. కొట్టాయం, పథనంతిట్ట, ఇడుక్కి జిల్లాలపై వరదలు, వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటివరకూ 18 మంది మృతి చెంది ఉంటారని విపత్తు నిర్వహణా దళాలు ప్రాథమిక అంచనా వేస్తున్నాయి. కేంద్రహోంశాఖ నేరుగా పరిస్థితిని సమీక్షిస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola