Kanuma Celebrations: శారదాపీఠంలో గోమాతలకు పూజలు | Sankranthi
విశాఖ పెందుర్తిలోని శారదాపీఠంలో కనుమను పురస్కరించుకుని గోపూజ నిర్వహించారు. పీఠం ప్రాంగణంలోని గోశాలలో గోమాతలకు ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర స్వామి పూజలో పాల్గొన్నారు. గోమాతకు హారతులిచ్చారు. తెలుగురాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండేలా చూడాలని గోమాతను ప్రార్థించారు.