Kadapa Police : కడపలో వరుస ఏటీఎంల చోరీ కేసును చేధించిన పోలీసులు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడప నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎంల దొంగతనానికి పాల్పడిన హర్యానాలోని మేవాఠ్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ మీడియా సమావేశం నిర్వహించి..నాలుగు రోజుల్లోనే ముఠాను పట్టుకున్న తీరును వివరించారు. ఏటీఎం దొంగల నుంచి 9.5 లక్షల రూపాయల నగదు, లారీ, రెండు నాటు తుపాకులు, సుమారు 20 కేజీల గంజాయి, దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులు హర్యానా కు చెందిన కరుడు గట్టిన మేవాఠ్ గ్యాంగ్ నేరగాళ్లు గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ నెల 7వ తేదీనృ తెల్లవారు జామున రిమ్స్, చింతకొమ్మ దిన్నె పరిధిలో ఏటీఎం లను పగులకొట్టి 41 లక్షల రూపాయల ను దొంగిలించిన ముఠా, అత్యాధునిక పరికరాలు ఉపయోగించి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారన్నారు.