JC Kishore Kumar: న్యూఇయర్ వేడుకల్లో మంత్రి కాళ్లకు మొక్కిన జేసీపై విమర్శల జడి

కొత్త సంవత్సర వేడుకల్లో ఓ ఐఏఎస్ అధికారి...మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లకు నమస్కరించటంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం జిల్లా రెవెన్యూ విభాగానికి జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కిషోర్ కుమార్ మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రికి బొకే ఇస్తూ...వంగి కాళ్లను తాకి నమస్కారం చేయటంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవస్థను నడిపించాల్సిన అధికారులు ఇలా రాజకీయనాయకుల కాళ్లకు మొక్కటం దేనికి నిదర్శనం అంటూ సోషల్ మీడియాలో జేసీపై విమర్శల జడి కురుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola