Amma Vodi: రాజ్యసభలో బాలల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టానికి సవరణ కోరిన విజయసాయి రెడ్డి

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న అమ్మ ఒడి పథకం దేశమంతటా అమలు చేసేందుకు వీలుగా బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (సవరణ) 2020 పేరిట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని 21 నుంచి 60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లు నిరుద్యోగ భృతి పొందే హక్కును కల్పించేలా మరో రాజ్యాంగ (సవరణ) బిల్లును ప్రతిపాదించారు. ప్రార్ధనా మందిరాలపై దాడులకు పాల్పడే నిందితులకు కఠిన జైలు శిక్ష విధించాలని కోరుతూ... సమాజంలో శాంతి సామరస్యతలను కాపాడవచ్చని ఆయన అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram