తొక్కిసలాట లో 12 మంది మృతి,ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
వైష్ణోదేవి ఆలయంలో జరిగిన ఘటన కలచి వేసింది. కొత్త సంవత్సరం వేళ జరిగిన దుర్ఘటనపై దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.జమ్ముకశ్మీర్లో తీవ్ర విషాదం నింపే ఘటన జరిగింది. ప్రముఖ దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో 12మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్మకశ్మీర్లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు.