PM Modi Speech: క్రమశిక్షణతో నడుచుకున్నాం.. మనపై ఉన్న అనుమానాలు తొలగించేశాం... ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం

స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి కరోనా పరిస్థితులు గుర్తు చేశారు. కరోనా మొదటి దశలో చాలా అనుమానాలు వచ్చాయని... వైద్యం అందరికీ అందుతుందో లేదో.. టీకా ఎప్పటికి వస్తుందో అనే అనుమానాలు చాలా మందిలో ఉండేదని చెప్పారు. అయితే క్రమంగా పుంజుకొని ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చామని.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. దేశ ప్రజల క్రమశిక్షణతోనే ఇదంతా సాధ్యమైందని.. భవిష్యత్‌లో కూడా ఇలాంటి పంథా కొనసాగించాలని ప్రధాని మోదీ సూచించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola