Maha Kumbh Mela 2025 Day 1 Highlights | ప్రయాగలో కళ్లు చెదిరిపోయే విజువల్స్ | ABP Desam

ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశ్వరూపాన్ని ప్రతిబింబిస్తోంది. త్రివేణి సంగమం వద్ద గంగ, యమున, సరస్వతి నదుల కలయికలో స్నానం చేయడానికి భక్తజనాలు సముద్రపు అలల లా చేరుకుంటున్నారు. కులాలు, మతాలు, దేశాలు, జాతులు అన్నీ అడ్డుగోడలు తొలగిపోయి, ఈ మహామేళాలో అందరూ ఒకటిగా మారిపోతున్నారు. 

నిన్న ఒక్కరోజు మాత్రమే కోటి 65 లక్షల మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా రెండు లక్షల మందితో కూడిన ఈవెంట్ నిర్వహించడమే చాలామందికి పెద్ద సవాలుగా ఉంటుంది. అయితే ఈ మహాకుంభమేళాలో కోటిలా భక్తులు ఒకే చోట చేరి ఆధ్యాత్మిక భావనలో తడిసిపోతున్నారు. 

ఈ మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. గంగ, యమున నదుల పవిత్ర జలాల్లో స్నానం చేసి భక్తులు తమ పాపాలను తొలగించుకుంటారని విశ్వసిస్తారు. అంతేకాకుండా మహాశివుడిని ఆరాధించడం, పితృదేవతల పూజలు నిర్వహించడం ద్వారా పుణ్యలోకాలను చేరుకుంటారని భక్తుల నమ్మకం.  

కుంభమేళాలో భాగంగా, నదీ స్నానానికి వచ్చే భక్తుల సంఖ్యను చూసి ప్రపంచం గర్విస్తుంది. భక్తుల విస్ఫోటనం చూస్తే మానవ సమానత్వానికి మహాకుంభమేళా అద్దం పట్టినట్లు అనిపిస్తోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక ఉత్సవమే కాదు, ఒక మనిషి నుంచి మరో మనిషికి సానుభూతిని, ప్రేమను పంచే అసాధారణ వేదిక.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola