Kargil Vijay Diwas : నేషనల్ వార్ మెమోరియల్ లో కార్గిల్ విజయ్ దివస్ | ABP Desam
దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్గిల్ అమరవీరుల త్యాగాలకు నివాళులు అర్పించి...23 ఏళ్లక్రితం పాక్ ను తోక ముడిచేలా చేసిన భారతీయ సైనికుల త్యాగాలను కొనియాడుతూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నేషనల్ వార్ మెమోరియల్ లో రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్, త్రివిధదళాధిపతులు అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల గౌరవజ్ఞాపకార్థంగా ఆర్మీ హెలికాఫ్టర్లు గాల్లో చక్కర్లు కొడుతూ నివాళులు అర్పించాయి.