Bengaluru Celebrate Diwali : బెంగుళూరు, మైసూరులో విన్నూత్న నిరసన | ABP Desam
బెంగుళూరు, మైసూరులో ప్రజలు విన్నూత్న రీతిలో దీపావళి నిర్వహించారు. రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా ఉండటంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తూ ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయినా నాయకులు పట్టించుకోవటం లేదనే ఆగ్రహంతో రోడ్లపై గోతులు ఉన్న చోట్ల స్థానికులు దీపావళి పండుగ నిర్వహించారు. బెంగుళూరులో లారీ ఢీకొని బైకర్ చనిపోయిన చోట...గోతుల్లో దీపావళి క్రాకర్స్ కాల్చారు. మైసూరులో కూడా స్థానికులు ఇదే విధంగా నిరసన తెలిపారు. రోడ్లు దెబ్బతిన్న చోట..గోతుల్లోనూ దీపావళి ప్రమిదలు ఉంచి నిరసన తెలియచేశారు