Hindupur Balakrishna House: హిందూపురంలో టీడీపీ, వైసీపీ నేతల సవాళ్ల పర్వం...తోపులాట..!

హిందూపురం మునిసిపల్ పరిధిలోని మోతకపల్లి కి వెళ్లేదారిలో డంపింగ్ యార్డ్ తరలింపు విషయం టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 2014 నుంచి 19 వరకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డంపింగ్ యార్డ్ ఎందుకు తరలించలేదని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీనికి చర్చకు రావాలని టీడీపీ నాయకులు సిద్ధంకాగా....ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముందు చర్చ పెట్టాలంటూ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు సైతం వాగ్వాదానికి దిగగా...ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించారు. అయినా రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola