Tanuku నియోజకవర్గంలో అమరావతి పాదయాత్రలో హై టెన్షన్ | ABP Desam
తణుకు లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అమరావతి రైతుల పాదయాత్ర తణుకు నరేంద్ర కూడిలికి వద్దకు వచ్చే క్రమంలో... తణుకు జేఎసీ నిరనస ర్యాలీ ఎదుటపడింది. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా జేఎసీ నేతలు.. నల్లబెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా 3 రాజధానుల పేరుతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా సభ ఏర్పాటు చేసి, నిరసన తెలుపుతూ గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.