Farmer Death: MR0 ఆఫీస్ లో సమస్య వివరిస్తూనే కుప్పకూలిపోయిన రైతు | ABP Desam
చిత్తూరు జిల్లా పెనమూరు మండల MRo కార్యాలయంలో ఓ రైతు సమస్య వివరిస్తూనే కుప్పకూలిపోయారు. ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న 2.52 ఎకరాల వ్యవసాయ భూమిని తిమ్మినాయుడు కండ్రిగ గ్రామస్తులు ఆక్రమణ చేస్తున్నారు. దీనిపై తనకు న్యాయం చేయాలంటూ రైతు పి. రత్నం నిన్నటి నుంచి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రామస్తులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నా... అధికారులు అడ్డుకోకపోవడంతో రైతు మనస్తాపానికి గురయ్యారు. దీంతో.. ఈరోజు అధికారులతో మాట్లాడుతుండగానే.. గుండెపొటుతో మృతి చెందారు