Faria Abdullah : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ఫారియా అబ్దుల్లా
జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా మెప్పించిన నటి ఫారియా అబ్దుల్లా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఫిల్మ్ నగర్ లో మొక్కలను నాటిన ఫారియా....ఎంపీ సంతోష్ కుమార్ తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంకల్పంపై ప్రశంసలు జల్లు కురిపించారు. తనలానే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని నటులు ఆనంద్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ శాన్వీ మేఘనలకు సవాల్ విసిరారు ఫారియా అబ్దుల్లా. గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవ...ఫారియాకు వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు.