CPM MAHASABHA: తాడేపల్లిలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర మహాసభలు
సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతున్నాయి. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఎగురవేసి మహాసభలను ప్రారంభించారు. సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బీవీ రాఘవులు ఈ సభలకు హాజరయ్యారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పై కామ్రేడ్లు భవిష్యత్ కార్యాచరణకు రెడీ అవుతున్నారు..