CJI Justice NV Ramana-Vaikuntha Ekadasi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
వైకుంఠ ఏకాదశి ( Vaikuntha Ekadasi) సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి శ్రీవారి ఆశీస్సులు పొందారు. టీటీడీ అధికారులు సీజేఐకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి పట్టువస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.