మోడీ రక్షణ విషయంలో పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీజేపీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రక్షణ విషయంలో పంజాబ్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బిజేపి‌ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు.. తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్లరిబ్బన్లు నోటికి కట్టుకుని బిజేపి నేతలు వినూత్న నిరసన తెలియజేశారు.. ఈ సందర్భంగా బిజేపి నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. 130 కోట్ల మంది భారతీయులు ఎన్నుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని, అలాంటి వ్యక్తి రక్షణ కల్పించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.. దీనికి పంజాబ్ సీఎంతో పాటు రాహుల్ గాంధీ,సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బిజేపి నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola