BJP MRPS: బీజేపీ పై మండిపడ్డ ఎం.ఆర్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య

షెడ్యూల్ కులాల వర్గీకరణకు పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ మండిపడ్డారు. చట్ట సభల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఆమోదం తెలపాలని దండోరా ఆధ్వర్యంలో బాబు జగ్ జీవన్ రావు విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు పార్లమెంట్ వర్గీకరణ చర్చ కూడా తీసుకొని రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola