Bill Gates: బిల్ గేట్స్ కు బాంబే హైకోర్టు నోటీసులు | ABP Desam

అమెరికా దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ కు భారత్ లోని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల.. బాంబే హైకోర్టులో దిలీప్ లునావత్ అనే వ్యక్తి కొవిషీల్ట్ టీకా తీసుకోవడం కారణంగా తన కుమార్తె మృతి చెందిందని.. వెయ్యి కోట్ల పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా..కొవిషీల్డ్ భారత్ లో తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. టీకా తయారీలో భాగస్వామ్యం ఉన్న అన్ని సంస్థలకు బాంబే హైకోర్టు నోటీసులు పంపింది. ఈ జాబితాలో బిల్ గేట్స్ నేతృత్వంలో పని చేసే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా ఉంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola