మూడు రాజధానుల తోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమన్న బండి నారాయణస్వామి

మూడు రాజధానుల తోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని ప్రముఖ కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, సుప్రసిద్ధ రచయిత బండి నారాయణస్వామి అన్నారు. తిరుపతిలోని ఇందిరా మైదానంలో రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి మేధావులు, కవులు, రచయితలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి నారాయణస్వామి మాట్లాడుతూ రాయలసీమ ఇప్పటికే అన్ని విధాలుగా నష్టపోయిందన్నారు. రాయలసీమ జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం చెబుతున్నట్లుగా కర్నూలులో రాజధాని అవసరమని అభిప్రాయ పడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola