Asaduddin owaisi Fires On Modi: చైనా ఆక్రమణలపై మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు | DNN | ABP Desam
సరిహద్దుల్లో చైనా చేస్తున్న కుయుక్తులపై MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహాం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా బార్డర్ లో చైనా నిర్మాణాలు చేపడుతున్న ప్రధాని మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వస్తున్నా... BJP సర్కార్ దానిపై నోరు మెదపట్లేదని మండిపడ్డారు. చైనా ఆక్రమణలపై ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి కూడా మాట్లాడుతున్నారు. కానీ, నరేంద్ర మోదీ మాత్రం మౌనదీక్ష చేపట్టారా..? అని అసదుద్దీన్ ఓవైసీ విమర్శల వర్షం కురిపించారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి.. 15 రౌండ్ల చర్చల ద్వారా ఏం సాధించారో దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.