Aryan Khan: డ్రగ్స్ కేసులో వీడియో బయటపెట్టిన సంజయ్ రౌత్

ముంబయి డ్రగ్స్ కేసు కేంద్రం, శివసేన మధ్య రచ్చకు కారణమైంది. ఎన్ సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ చేత బలవంతంగా తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్నారని ఆరోపిస్తూ శివసేన నేత సంజయ్ రౌత్ ఓ వీడియో విడుదల చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట దిగజార్చేందుకే డ్రగ్స్ కేసు తీసుకొచ్చారని తెలిపారు. డ్రగ్స్ కేసుకు సారథ్యం వహిస్తున్న ఎన్ సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేస్తూ ఇప్పటికే మహారాష్ట్ర మంత్రులు ఆరోపణలు చేస్తున్నారు. పరారీలో ఉన్న ప్రైవేటు డిటెక్టివ్ గోసవీ... దర్యాప్తు సంస్థతో ముడుపుల వ్యవహారం జరుగుతోందన్నారు. ఈ ఆరోపణలను ఎన్ సీబీ అధికారులు తోసిపుచ్చారు. దర్యాప్తు కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, అటువంటివి జరిగే అవకాశమే లేదన్నారు. ముడుపుల వ్యవహారం జరిగితే నిందితుడు ఇంకా జైల్లోనే ఎందు షకు ఉంటాడని ప్రశ్నించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola