ABP Desam Effect:Maharastra నుంచి వస్తున్న ప్రజలకు సాలురా చెక్ పోస్ట్ వద్ద కరోనా పరీక్షలు

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు సాలురా చెక్ పోస్టు వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు వైద్యాధికారులు. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి దీంతో అక్కడి నుంచి తెలంగాణ వస్తున్న వారికి పరీక్షలు జరపాలని గతంలో ఏబీపీ దేశం కథనాన్ని ప్రసారం చేసింది. అందుకు స్పందనగా తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్ లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వస్తున్న ప్రయాణికులకు కోవిడ్ చెకప్ చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని రిటర్న్ పంపుతున్నారు. మాస్కులు ధరించకుంటే తెలంగాణలోకి అనుమతి నిరాకరిస్తున్నారు. బోధన్ డిఎం అండ్ హెచ్ ఓ విద్య సాలురా చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola