భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం

Continues below advertisement

మొన్న ప్రధాని మోదీ.. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇద్దరూ కర్ణాకట వెళ్లి అక్కడి ఉడిపి ప్రాంతంలోని శ్రీకృష్ణ మఠంలో కొలువుదీరిన శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఆలయంపై విపరీతంగా చర్చ జరుగుతోంది. అసలు ఈ ఆలయం స్పెషాలిటీ ఏంటి? ఆ ఆలయం చరిత్రేంటి? అని తెగ వెతికేస్తున్నారు చాలామంది. అందులోనూ అన్ని ఆలయాల్లో మాదిరిగా ఈ ఆలయంలో విగ్రహం తూర్పు వైపు కాకుండా.. పడమర వైపు తిరిగి ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే.. ఈ ఆలయంలో మూలమూర్తిని మిగిలిన ఆలయాల్లో మాదిరిగా నేరుగా ద్వారం నుంచి చూడటం నిషేధం. కేవలం ఆలయం గోడల వద్ద ఉన్న రంథ్రాల నుంచి మాత్రమే చూడాలి. వీటన్నింటి వల్ల ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఇంకా పెరుగుతోంది. ఉడిపి శ్రీకృష్ణాలయ చరిత్ర ఇప్పటిది కాదు. ముఖ్యంగా ఈ ఆలయ మూలమూర్తి విగ్రహం ద్వాపరయుగానికి చెందినదిగా.. అందులోనూ శ్రీకృష్ణుడే స్వయంగా ఈ విగ్రహాన్ని విశ్వకర్మ చేత తన భార్య రుక్మిణి కోసం చేయించినట్లు పురాణగ్రంథాల్లో ఉంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola