Pardesi Pedamma Kathalu|Pathala Bhairavi|తొలితరం తెలుగు జానపదాల్లో ఆణిముత్యం..పాతాళభైరవి!
1951 లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన జానపద చిత్ర రాజం పాతాళభైరవి. యువరక్తం ఉరకలేసే కుర్రాడిగా ఎన్టీఆర్....అత్యుత్తమ ప్రతిభతో నేపాల మాంత్రికునిగా ఎస్వీఆర్ నటన...అహో అనిపించే దర్శకుడు కేవీరెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, ఘంటసాల పాటలు...పాతాళభైరవిని చరిత్రలో ఆణిముత్యంలా నిలబెట్టాయి. అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం పూర్తి చేసుకున్న ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ సినిమాపై పరదేశీ రివ్యూస్ మెలనీ గ్రీన్ బర్గ్...ఏబీపీ దేశానికి అందిస్తున్న విశ్లేషణ.