Prabhas KaranJohar : సౌత్ సినిమాలపై దృష్టి సారించిన బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ | ABP Desam
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ 'బాహుబలి' సినిమా తరువాత నుంచి అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'రాధేశ్యామ్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోపక్క 'ఆదిపురుష్', 'సలార్' వంటి సినిమాల్లో నటిస్తున్నారు ప్రభాస్. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.