Jr NTR Nandamuri Family Relations: దూరం పెరుగుతోందా..? ఇది దేనికి నిదర్శనం..?
నందమూరి తారకరామారావు శతజయంత్యుత్సవాల సందర్భంగా ఆగస్ట్ 28వ తేదీన ఆయన స్మారకంగా ప్రత్యేక వంద రూపాయల నాణాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపుగా నందమూరి కుటుంబం అంతా హాజరైంది. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మళ్లీ అదే టాపిక్. మనవళ్లలో ఒకడైన, తాత పేరు పెట్టుకున్న తారక్ ఎక్కడా అని.