కేరళలో పుష్ప సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న అల్లుఅర్జున్, రష్మిక |
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ పుష్ప చిత్రబృందం ప్రమోషన్ లో జోరు చూపిస్తోంది. తాజాగా కేరళలో పర్యటిస్తున్న పుష్ప బృందం అక్కడి అభిమానులను పలకరించింది రష్మిక మందన్నా, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తో కలిసి కేరళలో ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్...ఆర్య సినిమా నుంచి తనపై చూపిస్తున్న అభిమానాన్ని మర్చిపోలేనన్నారు. కేరళలో తనకున్న ఫ్యాన్ బేస్ కారణంగానే టాలీవుడ్ లో తనకు గౌరవం పెరిగిందన్నాడు అల్లు అర్జున్.