Actress Namitha Into Politics: త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్న సినీ నటి నమిత
తిరుమల శ్రీవారిని సినీ నటి నమిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.... ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత మాట్లాడిన నమిత... పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.