Vijaya Sai Reddy on YSRCP Loss | వైసీపీ ఓటమిపై విజయసాయి రెడ్డి ఏమన్నారంటే..?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ ఎన్నికల ఫలితాలపై వైసీపీ సీనియర్ లీడర్ విజయసాయి రెడ్డి స్పందించారు. ఓటమిపై సమీక్షించుకుని..తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు.
జగన్ ఏం చేయలేదు అసలు. సరే అభివృద్ధి చేయలేదు. సంక్షేమం చేశాడు కదా. ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూరేలా వాళ్లంతా ఏదో ఒక పథకంలో ఉండేలా వాలంటీర్లతో ఫాలో అప్ చేయించి మరీ సంక్షేమ ఫలాలు అందించాడు కదా. మరి ఎక్కడ తేడా కొట్టింది. 175 నియోజకవర్గాల్లో 151 కొట్టేసిన అదే పార్టీ..ఇప్పుడు కనీసం పదో నెంబర్ అంకెకు అటూ ఇటూ ఊగిసలాడటం ఏంటి అసలు. మిస్టేక్స్ ఏంటో అని ఆలోచించే ముందు ఠక్కున గుర్తొచ్చేస్తున్న ముఖాలు కొన్ని ఉన్నాయి. వీళ్ల మీద మాకేమీ పర్సనల్ గ్రెడ్జ్ లేదు. అలా మర్చిపోయే మొఖాలు ఏం కాదు. జర్నలిస్టులైన మా చెవులు చిల్లులు పడేలా బూతులతో రెచ్చిపోయారు. అసభ్యపదజాలాలు, వ్యక్తిగత దూషణలతో పరమ చిరాకు తెప్పించారు. ఓ పక్కన జగనన్న వై నాట్ 175 అంటుంటే వీళ్లేమో నోరు పారుదల శాఖ మంత్రుల్లా జనాల చెవులు తుప్పు వదలగొట్టేశారు. జనాలకు ఎంత చిరాకు వచ్చిందంటే పెద్దిరెడ్డి, జగన్ రెడ్డి తప్ప క్యాబినెట్ లో ఉన్న ఏ మంత్రి గెలవలేదు. టక్కున గుర్తొచ్చే ఐదు పేర్లు చెప్పుకుందాం ఈ వీడియో.