Pawan Kalyan off to Mangalagiri | పిఠాపురంలో గెలిచిన భర్తకు వీరతిలకం దిద్దిన పవన్ భార్య అనా
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపిఠాపురంలో ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి బయలుదేరారు. కుమారుడు అకీరా నందన్ తో కలిసి మంగళగిరి వెళ్తున్న పవన్ కు ఆయన భార్య అనా కొణిదెల వీరతిలకం దిద్ది హారతినిచ్చి పంపించారు.
ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం ఖరారైంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులకలో జనసేన దాదాపు 20 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతను కనబరిచింది. దీంతో పవన్ కళ్యాణ్కు సోషల్ మీడియాలో వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
తాజా తన మామయ్య, జనసేనాని గెలుపుపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పవన్ ఓ చిన్నారి ఎత్తుకున్న ఫోటో షేర్ చేస్తూ.."ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మరియు భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది. జనసేన పార్టీ పవర్ తుఫాను" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే పవన్ గెలుపును హీరో నితిన్, డైరెక్టర్ హరీష్ శంకర్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.