YSRCP Leader Atrocities On TDP Activists: అరాచకానికి దిగిన వైసీపీ నాయకుడు
పుంగనూరు మండలంలోని వైసీపీ నాయకుడు ఒకరు దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నుంచి పలువురు... ఈ యాత్రలో భాగంగా... పుంగనూరులోని సుగాలిమిట్ట వద్దకు చేరుకున్నారు. వారు టీస్టాల్ వద్ద టీ తాగుతుండగా, అక్కడికి వచ్చిన వైసీపీ నేత దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి దిగారు. వారి సైకిల్స్ పై ఉన్న టీడీపీ జెండాలు తీయించారు, వారి చేత పసుపు చొక్కాలను మార్పించారు.