Tirumala: తిరుమలగిరిలో లక్ష దీపారాధన

కృష్ణా జిల్లా తిరుమలగిరి దేవస్థానంలో లక్ష దీపారాధనోత్సవం జరిగింది. కార్తీకమాసంలో చివరి శనివారం కావడంతో దేవాలయ ప్రాంగణంతో పాటు కొండకు వెళ్ళే మెట్లపైన దీపాలను వెలిగించారు. దీపకాంతులతో మెట్ల మార్గం మిరుమిట్లు గొలిపింది. తిరుమలగిరి కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయం తో పాటు మల్లేశ్వర స్వామి గుడి కూడా ఉంది. కార్తీకమాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి సన్నిధి కావడంతో .. స్వామికి ఇష్టమైన శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వామి భక్తురాలు ఆదిలక్ష్మి తన బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola