East Godavari: అమలాపురంలో పర్యటించిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. అమలాపురం రూరల్ మండలం సమనసలో వర్షాలకు నీట మునిగిన పొలాలను మనోహర్ పరిశీలించారు. ఉప్పలగుప్తం మండలంలో గుండెపోటుతో చనిపోయిన రైతు కుటుంబానికి రూ. 50 వేల చెక్ అందించారు. అనంతరం అమలాపురంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో రైతులు ఒకప్పుడు క్రాప్ హాలిడే ఎందుకు పాటించారో ఇప్పుడు తెలుస్తుందన్నారు. రోడ్లపై జనసేన శ్రమదానం చేస్తోంటే దేశం మొత్తం ఆశ్చర్యపోయిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా రోడ్లు ఉన్నాయా అని చర్చలు జరిగాయన్నారు. రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లోకి వెళ్లకుండా సీఎం జగన్ కేవలం హెలికాప్టర్ లో నుంచి చూసి వెళ్లిపోయారని విమర్శించా