AP Odisha Border Issue: సీఎం నవీన్ పట్నాయక్ తో సీఎం జగన్ భేటీ... సమస్యల పరిష్కారానికి సీఎస్ లతో కమిటీ
ABP Desam
Updated at:
09 Nov 2021 07:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ, ఒడిషా రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు చీఫ్ సెక్రటరీలతో కమిటీ వేయాలని ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ వెళ్లి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్తో సమావేశం అయ్యారు. దాదాపుగా గంట సేపు జరిగిన సమావేశంలో నేరడి బ్యారేజీ, జంఝావతి ప్రాజెక్ట్, కొఠియా గ్రామాల సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ పరస్పర సంప్రదింపులు ఉండేలా చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించారు.