Pawan Kalyan On YSRCP: యుద్ధానికి మీరు సిద్ధమైతే.. మేం సంసిద్ధం, ఏ పద్ధతైనా ఓకే: పవన్ కళ్యాణ్

Continues below advertisement

తాను చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నానని, కానీ వైఎస్సార్‌సీపీ నేతలు హద్దులు దాటుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు బాపట్లలో పుట్టాను.. నాకు బూతులు రావా అన్నారు. తనకు బూతులు తెలిసినా, అలా మాట్లాడటం పద్ధతి కాదని మాట్లాడనని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఒక్క భాషలో తిడితే తాను నాలుగు భాషల్లో తిట్టగలనంటూ మండిపడ్డారు. బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరని ప్రశ్నిస్తే, కోడి కత్తి గురించి, రివర్స్ టెండరింగ్ గుంచి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తన వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కావడం లేదన్నారు. తల్లిదండ్రులు నేర్పిన సంస్కారాన్ని చూపిస్తున్నానని, ఆడబిడ్డలకు తాను గౌరవం ఇస్తానని, వైసీపీ నేతల భార్యలు, ఆడబిడ్డలతో పాటు వైసీసీ అధినేత ఇంటి మహిళలను సైతం ఒక్క మాట తాను అననని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అలా చేస్తామని, లేదా వేరే పద్ధతిలో చేస్తారా అని ప్రశ్నించారు. యుద్ధానికి మీరు సిద్ధమైతే మేం సంసిద్ధమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram