Vizianagaram News : రాజాం మల్లిఖార్జున కాలనీలో అర్థరాత్రి అల్లర్లు | DNN | ABP Desam
Vizianagaram జిల్లా Rajam మల్లిఖార్జున కాలనీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అర్థరాత్రి సమయంలో కొందరు యువకులు నానా హడావిడి చేశారు. అల్లరి చేస్తున్న పోకిరీలను స్థానికులను ప్రశ్నించగా..వారిపై కర్రలతో దాడికి దిగారు. దీంతో ఇళ్లలోకి పారిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల రాకతో మద్యంబాబులు పరారయ్యారు.