విశాఖ మన్యంలో పంజా విసురుతున్న చలి పులి

Continues below advertisement

విశాఖ మన్యం లో కనిష్ట స్థాయికి   ఉష్ణోగ్రతలు పడిపోయాయి .ఉష్ణోగ్రతలు పడిపోతుండడం తో జనం రోడ్లమీదకు రావాలంటే వణుకుతున్నారు . ఉదయం 9 గంటల వరకూ మంచు తెరలు వీడడం లేదు. ముఖ్యంగా మన్య ప్రాంతాలైన అరకు,పాడేరు,చింతపల్లి ,లమ్మసింగి లాంటి ప్రాంతాల్లో దుప్పటిలా పేరుకుంటున్న పొగమంచు ను చూడటానికి పర్యాటకులు తరలివస్తున్నారు . ఉత్తరాది నుండి వీస్తున్న చలిగాలుల వల్ల  రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయితున్నట్టు అధికారులు చెబుతున్నారు . ఈ పరిస్థితి మరో రెండు మూడు రోజులు తప్పకపోవచ్చని అంటున్నారు . మాడుగుల లో 3. 5 డిగ్రీలకు ,పాడేరు లో 9 డిగ్రీలు ,చింతపల్లి లో 8. 4 ఇలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram